స్వీయనియంత్రణతో రోడ్డు ప్రమాదాల నివారణ
NEWS Feb 02,2025 03:29 am
నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవేదన వ్యక్తం చేశారు.అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అతివేగంగా, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు.