హైదరాబాద్లో ఈ నెల 7న ఎమ్మార్పీ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే లక్ష డప్పులు-వేల గొంతుల బహిరంగా సభను విజయవంతం చేయాలని సంఘం సిరికొండ మండల అధ్యక్షుడు మొట్టల దీపక్ కోరారు.మండలంలోని చిన్నవాల్గోట్లో సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. సభ్యులు సభను విజయవంతం చేయాలని కోరారు. దళితుల ఆత్మ గౌరవం కోసం ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు.