ఢిల్లీ ఎన్నికల వేళ ఆప్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఈనెల 5న అసెంబ్లీకి సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎనిమిది మందికి టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది ఆప్. దీంతో టికెట్లు దక్కక పోవడంతో బీజేపీలోకి జంప్ అయ్యారు. అయితే అవినీతి, అక్రమాలకు పాల్పడినందు వల్లనే ఆ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదని, వారు ఏ పార్టీ లోకి వెళ్లినా తమకు అభ్యంతరం లేదని ప్రకటించారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్.