ఎల్లారెడ్డి పురపాలక కమిషనర్ గా మహేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహించిన శ్రీహరి రాజు బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. నిజామాబాద్ పట్టణంలో శానిటరీ ఇన్స్ పెక్టర్ గా విధులు నిర్వహించారు. అనంతరం ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గా కొన్ని నెలల పాటు పని చేశారు. ప్రస్తుతం ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా పూర్తి బాధ్యతలు చేపట్టారు మహేష్ కుమార్. పట్టణ అభివృద్ది కోసం కృషి చేస్తానని అన్నారు.