ప్రమాదంలో జర్నలిస్టు మృతి నిజామాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వీడియో జర్నలిస్టు మృతి చెందాడు. ఈ ఘటన జానకంపేట శ్రీ లక్ష్మినరసింహ స్వామీ ఆలయం సమీపంలో జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహిపాల్ ఓ టీవీ ఛానెల్ లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ఎడపల్లి మండలం ఠానాకాలన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా జానకంపేట అలీసాగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తీవ్ర గాయాల పాలైన మహిపాల్ ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.