కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలం పరమళ్ల గ్రామస్థులు తాగు నీటి సమస్యతో బాధపడుతున్న విషయం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకురాగా ప్రత్యేక నిధులతో బొరు వేసి తాగు నీటి సమస్య లేకుండా చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు గ్రామస్థులు.