మల్లాపూర్ మండలంలోని సిరిపూర్, మొగిలిపేట్ గ్రామాల్లో ఎరువుల దుకాణాలను శనివారం వ్యవసాయ అధికారి లావణ్య తనిఖీ చేశారు. డీలర్లు తప్పనిసరిగా ఎరువులు ఈ పాస్ మిషన్ ద్వారానే అమ్మాలని తెలిపారు. రైతులు ఎరువుల కొనుగోలుకు వచ్చినప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకుని రావాలని అన్నారు. డీలర్లు ఎక్కువ మొత్తంలో యూరియా ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో సంజాయిషీ కోరుతూ ఉత్తర్వులు జారీ చేశారు.