కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2025పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. దేశ జీడీపీలో అత్యధిక భాగం తెలంగాణ రాష్ట్రానిదేనని, అయినా ఏ రంగానికి పూర్తి స్థాయిలో కేటాయింపులు జరపలేదన్నారు .ఇతర రాష్ట్రాలకు ఎక్కువ, తక్కువ ఇచ్చారు అని ఇక్కడి ప్రజలు అనుకోకుండా బీజేపీ నాయకులు నిధులు తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని ఆరోపించారు.