కొండగట్టు అంజన్న సన్నిధిలో డీజీపీ
NEWS Feb 01,2025 11:16 am
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని ఈరోజు రాష్ట్ర డీజీపీ జితేందర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు శేషవస్త్రంతో సత్కరించి, స్వామి వారి ప్రసాదం అందజేశారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందర్, సీఐ నీలం రవి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.