కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2025పై స్పందించారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇది పూర్తిగా ప్రజల బడ్జెట్ అని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేశామన్నారు. ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. పెట్టుబడులకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందన్నారు. ప్రజలను మిగతా ప్రభుత్వాలు దోచుకుంటే తాము తిరిగి పేదలు, బడుగు, బలహీన, మధ్యతరగతి ప్రజల బలోపేతం కోసం కేటాయిస్తున్నామన్నారు.