టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. ఇవాళ పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2025పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చూసేందుకు బడ్జెట్ ఫుల్ గా ఉందని కానీ తెలంగాణకు ఒక్క పైసా కూడా కేటాయించలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఏడాదికి రూ. లక్ష కోట్ల పన్నులు కడుతున్నారని , బీజేపీని 8 సీట్లలో గెలిపించారని, మంత్రులుగా ఉన్న బండి, కిషన్ రెడ్డి నోరు విప్పాలని డిమాం డ్ చేశారు.