తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న అధ్యాపకుల రిటైర్మెంట్ వయోపరిమితి 60 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచే ప్రభుత్వ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ శాతవాహన విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసూట్ అధ్యాపకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కృతజ్ఞతలు తెలిపారు.