మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభం
NEWS Feb 01,2025 08:11 am
కోరుట్ల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలలో 2025-26 సంవత్సరం కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. 5వ తరగతి (80 సీట్లు), ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంఈసీ(40 సీట్లు), సీఈసీ(40సీట్లు), 6, 7, 8వ తరగతుల్లోని మిగిలిన సీట్ల భర్తీకి, ఆసక్తి ఉన్న మైనారిటీ, నాన్-మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.