మెట్పల్లికి చెందిన పారిపల్లి శ్రీకాంత్ అనే యువకుడి మృతదేహం పట్టణంలోని SRSP కెనాల్లో లభ్యమైనట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.29న రాత్రి కుటుంబీకులు పడుకున్న తర్వాత శ్రీకాంత్ ఇంట్లో నుంచి వెళ్లాడని, ఉదయం లేచి చూసే సరికి లేక పోవడంతో కుటుంబీకులు PSలో ఫిర్యాదు చేశారు. కెనాల్లో మృతదేహాన్ని గుర్తించి స్థానికులు సమాచారం ఇవ్వగా వెలికితీసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.