రంజీ సీజన్లో నాలుగు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపిన హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు అభినందించారు. గ్రూప్-బిలో టాపర్గా ఉన్న విదర్భపై ఎలాగైనా గెలవాలని జట్టును ఉత్తేజ పర్చారు. 928 పరుగులు చేసిన తన్మయ్ అగర్వాల్ను ప్రశంసించారు. తన సొంత నిధుల నుంచి రూ.1 లక్ష నగదు బహుమతిని ప్రకటించారు. 33 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ ప్రదర్శనను కొనియాడారు.