సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. అడ్డగోలుగా మాట్లాడటం తనకు కూడా వచ్చని అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. 10 ఏళ్ల పాలనా కాలంలో కేసీఆర్ చేసింది ఏమీ లేదన్నారు. తమ ఆస్తులు పెంచుకునేందుకు మాత్రమే పని చేశారని ఆరోపించారు.