ఢిల్లీలోని నంగ్లోయి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోహిత్ చౌదరి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఆయనతో పాటు జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్, ఉత్తర ప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఆప్, బీజేపీ ప్రజలకు ఆచరణకు నోచుకోని హామీలు ఇస్తూ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.