ధర్మపురిలోని గురుకుల మైనార్టీ పాఠశాలలో జరిగిన ఘటనపై ఎవ్వరూ ఎలాంటి అధైర్య పడాల్సిన అవసరం లేదని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ఐదుగురు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు. ఈ ఘటన పైన పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించామన్నారు. విద్యార్థులకు పెట్టే భోజనం నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.