ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ఆల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిని ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో నరేందర్ రెడ్డికి లైన్ క్లియర్ అయ్యింది.