జాతీయ పసుపుబోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డి ఢిల్లీలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ.. పసుపు బోర్డుకు చైర్మన్ గా పసుపు రైతు, సమర్థ నాయకత్వ లక్షణాలున్న పల్లె గంగారెడ్డిని ప్రధాని మోదీ నియమించడం హర్షణీయమన్నారు. పసుపు పంటకు అంతర్జాతీయ స్థాయిలో ఇంత వరకు లేనంతటి గుర్తింపును తీసుకొస్తానని, పసుపు పరిశోధనా కేంద్రాలను ప్రారంభించి పసుపు సాగులో సరికొత్త విప్లవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ చెప్పారు.