ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి
- మున్సిపల్ కమిషనర్
NEWS Jan 31,2025 05:08 pm
ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని మున్సిపల్ కమిషనర్ తోగిటి మోహన్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా మెట్ పల్లి పట్టణంలోని నేషనల్ హైవే రోడ్డులో, ఆర్డిఓ ఆఫీస్ ముందు ఆయన మొక్కలను నాటారు. హరితహారం సిబ్బంది ద్వారా మొక్కలను అందంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నిజాం, అశోక్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.