ఇబ్రహింపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన తోకల శేఖర్ గత సెప్టెంబర్ నెలలో కోరుట్ల బస్టాండ్లో ఫోన్ పోగొట్టుకున్నాడు. ఈ మేరకు వెంటనే కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ చేసి శుక్రవారం బాధితుడికి ఏఎస్ఐ అలీముద్దిన్ అందజేశారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్లో సంప్రదిస్తే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించవచ్చన్నారు.