ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఏకంగా 172 మంది సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేసింది. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర చరిత్రలో ప్రధానంగా సెక్రటేరియట్ లో ఇంత పెద్ద ఎత్తున సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ఫోకల్ లో పనిచేసిన వారికి మళ్ళీ ఫోకల్ పోస్టింగ్స్ ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి.