పెనుగొండ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మ వారి ఆశీస్సులతో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. అమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుని, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా తన జన్మ ధన్యమైందన్నారు. ఈ ఆలయానికి 2,600 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. అమ్మను దర్శించుకున్నా, వేడుకున్నా సకల కోరికలు తీరుతాయని అన్నారు సీఎం. తమ ప్రభుత్వం ఆలయాల అభివృద్దికి కృషి చేస్తోందని చెప్పారు.