దళిత మహిళ, ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించిన మాజీ మున్సిపల్ ఛైర్మన్, అనుచరులపై ఏస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీవో హరికృష్ణకు వినతి పత్రం అంద జేశారు. ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వెళ్లిన ప్రభుత్వ అధికారిపై దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.