కథలాపూర్ మండలం తాండ్ర్యాల గ్రామంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. అధికారులు గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. కుల వివక్ష చూపకుండా అందరు కలిసిమెలిసి ఉండాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ మద్దెల నాగేష్, కార్యదర్శి రవీందర్ ఉన్నారు.