పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు దక్కుతాయని ఎమ్మెల్యే మదన్ మోహన్రావు పేర్కొన్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన మహ్మద్ ఇర్షాదొద్దీన్కు సీడీసీ చైర్మన్ పదవి కట్ట బెట్టామన్నారు. అవినీతికి దూరంగా ఉంటూ ప్రజా సేవే ధ్యేయంగా సాగాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పదవులను కై వసం చేసుకునే లక్ష్యంతో సాగాలన్నారు.