వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆర్ రవీందర్ తెలిపారు. డిచ్పల్లి మండలంలోని మిట్పల్లి 33/11 సబ్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫీడర్ బ్రేకర్స్ను ఎస్ఈ ప్రారంభించారు. గతంలో మూడు గ్రామాలకు కలిపి ఒకే ఫీడర్ ఉండటంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిపి వేయాల్సి వచ్చేదన్నారు.