డ్రోన్ టెక్నాలజీపై భారీ పెట్టుబడి
NEWS Jan 31,2025 04:24 am
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. భారత దేశంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం రోజు రోజుకు పెరుగుతోందన్నారు. గరుడ ఏరోస్పేస్ కేంద్ర సర్కార్ తో ఒప్పందం చేసుకునేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. డ్రోన్ సిటీ ఏర్పాటు కోసం రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసిందన్నారు. డ్రోన్ లాజిస్టిక్స్ ను పెంచేందుకు యూటీఎం, పీఎల్ఐ, డీఎల్ఐ, ఎస్ఎల్ఐ, బీవీఎల్ఓఎస్ రూల్స్ కు సంబంధించి చర్చించడం జరిగిందన్నారు కేంద్ర మంత్రి.