రాష్ట్రంలో కూటమి పాలన గాడి తప్పిందని, చంద్రబాబు నిర్వాకం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఫీజులు చెల్లించక పోవడంతో చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. బాబు పాలన బాగుందంటూ బాకాలు ఊదిన నేతలంతా ఇప్పుడు మౌనంగా ఉన్నారని, ప్రజా ప్రభుత్వమని ప్రచారం చేసుకున్న సర్కార్ చేతులెత్తేసిందన్నారు. ప్రజలు లబోదిబోమంటున్నారని పేర్కొన్నారు.