ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే సీఎం ప్రకటించిన మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. భవనాల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఈఆర్సీ, ఏపీ ఎస్పీ2వ బెటాలియన్ భవనాలను పరిశీలించారు. ఇదిలా ఉండగా గత జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.