డాక్టర్ బాలుకు రోటరీ సేవా ప్రశంస 2025 సంవత్సరం పురస్కారం..
NEWS Feb 04,2025 04:24 am
రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి గాను గాను రోటరీ సేవా ప్రశంస పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక కావడం జరిగింది.
వ్యక్తిగతంగా 75 సార్లు రక్తదానం చేయడమే కాకుండా,17 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నందుకు అందజేయడం జరుగుతుందన్నారు.
ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజనరసింహారెడ్డి,ప్రధాన కార్యదర్శి కొడిప్యాక సత్యనారాయణకోశాధికారి సబ్బని కృష్ణహరి లకు డాక్టర్ బాలు కృతజ్ఞతలు తెలియజేశారు.