కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం రూ. 1 కోటి 15 లక్షలు
NEWS Jan 30,2025 05:53 pm
కొండగట్టు అంజనేయ స్వామి దేవస్థానంలో 70 రోజులకుగాను 12 హుండీలను కరీంనగర్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ, కార్యనిర్వహణాధికారి కృష్ణ ప్రసాద్ పర్యవేక్షణలో శ్రీ లలిత సేవా ట్రస్ట్ వారిచే లెక్కించగా, హుండీ ఆదాయం రూ. 1.15.93,291 నగదు, 55 గ్రాముల బంగారం, 3వేల గ్రాముల వెండి, 61 విదేశీ కరెన్సీ లభించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, అధికారులు, పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.