తూప్రాన్ మండల పరిషత్తు కార్యాలయంలోని ఐటిసి సునేహ్రాకల్ వాష్-ఐ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘన ద్రవ వ్యర్ధాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడంలో ఆచరణాత్మక ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషాద్రి, ఎంపీఓ సతీష్, గ్రామపంచాయతీ సెక్రటరీలు, ఎంపీడబ్ల్యు వర్కర్లకు అవగాహన కల్పించారు.