నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో నిర్వహిస్తున్న భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల సంఘీభావం తెలుపుతూ మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వంలో కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముందుగా కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూసేందుకు మాజీ సీఎం ఎంతో కృషి చేయడం జరిగింది. కార్యక్రమంలో మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,సత్యప్రకాష్, దండు శేఖర్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.