నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 35వ డివిజన్ నుండి నరేష్ ఆధ్వర్యంలో నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నేతృత్వంలో వందమందికి పైగా యువకులు చేరారు. వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గత కెసిఆర్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోవడంతో మళ్లీ BRS ప్రభుత్వం రావాలని చేరినట్లు తెలిపారు.