కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
NEWS Jan 30,2025 01:40 pm
మల్యాల కేంద్రంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కటకం వినయ్ అధ్వర్యంలో ప్రతిమ హాస్పిటల్ కరీంనగర్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో దాదాపు 300 మంది పేదలకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ నీలం రవి, స్థానిక నాయకులు ఆదిరెడ్డి, అనిల్, మారుతీ, మల్లయ్య, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.