గాంధీ చిత్రపటానికి నివాళులు
NEWS Jan 30,2025 01:40 pm
మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా మల్యాల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద మండల కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో అహింసా, సత్యగ్రహం అనే ఆయుధంతో జాతిని ముందుకు నడిపించిన జాతిపిత మహాత్మాగాంధీ అని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తిరుపతి, హరినాథ్, ప్రసాద్, ఇమామ్, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.