కాంగ్రెస్ పాలనతో తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లే దుస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రేవంత్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు
వచ్చాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. అర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిలువునా మోసం చేస్తుంది. చేతిలో ఎర్రబుక్కు పట్టికొని దేశమంతా తిరిగే రాహుల్ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు.