సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంపికైన లబ్దిదారులకు హైద్రాబాద్ లోని తన నివాసంలో చెక్కులను పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ. కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట మండలం యాడారం గ్రామానికి చెందిన లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా తమ ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు షబ్బీర్ అలీ.