జగిత్యాల కలెక్టరేట్లో మహాత్మా గాంధీకి నివాళులు
NEWS Jan 30,2025 11:55 am
జగిత్యాల కలెక్టరేట్లో మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా గురువారం మౌనం పాటించి నివాళులర్పించారు. భారతదేశానికి స్వేచ్ఛ ప్రసాదించిన మహా నాయకుడు, సమస్త విశ్వానికి శాంతి సందేశం ప్రబోధించిన జాతిపిత మహాత్మా గాంధీ అని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్లు బిఎస్ లత, గౌతమ్ రెడ్డి, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.