స్టేడియాన్ని పరిశీలించిన కమిషనర్
NEWS Jan 30,2025 01:39 pm
కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ అంబేద్కర్ స్టేడియాన్ని పరిశీలించారు. మైదానంలో పేరుకు పోయిన పిచ్చి మొక్కలను క్లీనింగ్ చేయించారు. చెత్తా చెదారాన్ని జెసిబి ద్వారా ట్రాక్టర్లలో లిఫ్ట్ చేయించి తరలించేలా చూశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు వర్ధన్ రెడ్డి, ముజీబ్, వి నరేష్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.