రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
NEWS Jan 30,2025 10:30 am
రాష్ట్రంలో పెట్టుబడులపై కూటమి సర్కార్ చేసిన ప్రయత్నాలు ఫలించాయని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ మూడో సమావేశంలో 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. దీంతో ఎస్ఐపిబీ ఇప్పటివరకు ఆమోదం తెలిపిన పెట్టుబడుల విలువ రూ. 3 లక్షల కోట్లు దాటాయి. అర్సెల్లార్ మిట్టల్, ఎన్టిపిసి, హెచ్పిసిఎల్, బిపిసిఎల్ వంటి సంస్థలు పెట్టుబడులకు లైన్క్లియర్ అయ్యింది. ఈ మేరకు అన్ని అనుమతులు పూర్తి చేసి ప్రాజెక్టులను గ్రౌండ్ చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.