చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ డీఎంహెచ్వో రాజశ్రీ స్పష్టం చేశారు. గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగనిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై వైద్యారోగ్య శాఖ కార్యాలయలో జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణ చేస్తే పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలు రిఫర్ చేసిన ప్రిస్క్రిప్షన్ను స్కానింగ్ సెంటర్లు అనుమతించొద్దన్నారు.