మహాత్ముడికి ఘనంగా నివాళి
NEWS Jan 30,2025 10:41 am
మెట్పల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు మైలారపు లింబాద్రి, ఆర్య వైశ్య సంఘం మెట్పల్లి పట్టణ అధ్యక్షులు మైలారపు రాంబాబు, కార్యదర్శి ఎల్మీ రవి, కోశాధికారి దొంతుల లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శి కొత్త నవీన్, కోట కిరణ్ , చాడ సురేష్ , చకినం, కేదార్ బండారి , తదితరులు పాల్గొన్నారు.