రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా యువకులు స్వచ్ఛందంగా ట్రాఫిక్ పోలీసుల విధులను అధ్యయనం చేయడం కోసం ముందుకు రావడం, విధుల్లో పాలుపంచు కోవడం అభినందనీయమని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ అన్నారు. మేరా యువ భారత్ నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేయబడిన 25 మంది యువకులు రెండు రోజుల పాటు నగరంలోని పలు జంక్షన్ల వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్తో పాటు కలిసి ట్రాఫిక్ నిర్వహణలో శిక్షణ తీసుకున్నారు.