కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఎంపీ రాకేశ్ రాథోడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా తనను ఎంపీ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో జనవరి 17న రాకేశ్ రాథోడ్ పై కేసు నమోదైంది. యూపీలో సీతాపూర్ కు చెందిన ఎంపీ మీడియాతో మాట్లాడుతుండగా తనన అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త చోటు చేసుకోవడంతో బందోబస్తు ఏర్పాటు చేశారు.