ఎడపల్లి మండలం తాడెం ఎస్బీఐలో క్యాషియర్గా పనిచేస్తున్న మసూద్ విధులు ముగించుకొని బైక్పై నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వస్తుండగా చిరుత వెంటపడింది. జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా లారీ, ఓ బైక్ రావడంతో చిరుత పక్కనే ఉన్న గుట్టల్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనపై అటవీ అధికారి ప్రతాప్ను సంప్రదించగా చిరుత వెంటపడింది వాస్తవమేనని అన్నారు. సమాచారం అందిన వెంటనే ఓ బృందాన్ని పంపించామన్నారు. చీకటి పడిన నేపథ్యంలో చిరుత తిరిగిన ఆనవాళ్లను సేకరిస్తామని తెలిపారు.