పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసిన నీటిపారుదల శాఖ ఏఈఈ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో జరిగింది.నిజామాబాద్లోని సుభాష్నగర్లో నివాసముంటున్న కత్లులపురం సాయిచరణ్ (25)కు ఆరు నెలల కిందట నీటిపారుదల శాఖలో ఏఈఈగా ఉద్యోగం రాగా ధర్పల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. రోజు మాదిరిగానే ధర్పల్లి మండలంలో విధులకు హాజరై మధ్యాహ్నం నిజామాబాద్కు తిరిగి వస్తూ డిచ్పల్లి మండలం నడిపల్లి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగ చికిత్స పొందుతూ మృతి చెందారు.