మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, రాజకీయ ప్రేరేపితమైనవని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కావాలని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. అధికారం ఉంది కదా అని కూటమి సర్కార్ కక్షసాధింపు ధోరణికి పాల్పడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేస్తే శిక్షించేందుకు కోర్టులు ఉన్నాయని , గుర్తు పెట్టుకోవాలని సూచించారు.